నవతెలంగాణ-హైదరాబాద్ : ఈశాన్య చైనాలో పాఠశాల జిమ్ పైకప్పు కూలిపోవడంతో 10 మంది మరణించగా, ఒకరు చిక్కుకుపోయారని రాష్ట్ర మీడియా సోమవారం నివేదించింది. హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్లోని క్వికిహార్లోని నెం. 34 మిడిల్ స్కూల్లోని జిమ్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కుప్పకూలిందని తెలిసింది. సోమవారం ఉదయం 5:30 నాటికి, శిథిలాల నుంచి 14 మందిని బయటకు తీశారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఆరుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. నిర్మాణ సంస్థకు బాధ్యత వహించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.