నవతెలంగాణ-హైదరాబాద్ : సీనియర్ నటుడు శరత్బాబు(71) మరణించాడు. గతకొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో భాదపడుతన్న శరత్బాబు కొద్ది సేపటి క్రితం మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శరత్ బాబు గత నెల రోజులగా ఏఐజీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం ఉదయం నుంచి ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలిపారు. మృత్యువుతో పోరాడి చివరకు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో మృతిచెందారు.