రైతులందరూ రైతు బీమా కు దరఖాస్తు చేసుకోవాలి.. 

– మండల వ్యవసాయ అధికారి ఆశా కుమారి..
నవతెలంగాణ చివ్వేంల: మండలంలో(18-6-2024) లోపు నూతనంగా  రైతు పట్టా బుక్కు వచ్చిన  రైతులందరూ రైతు బీమా కు దరఖాస్తు చేసుకోవాలని, మండల వ్యవసాయ అధికారి ఆశా కుమారి తెలిపారు. గురువారం మండల కేంద్రంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ  18నుంచి 59 సంవత్సరాల వయసు గల  (14-81964నుండి 14-8-2005) గల రైతులు రైతు భీమా కొరకు దరఖాస్తు చేసుకోవాలని, రైతు వేదికకు  రైతులు స్వయంగా   వచ్చి దరఖాస్తు ఫారం, పట్టాదారు పాసు బుక్కు, రైతు ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డ్ జిరాక్స్లు  స్థానిక ఏ ఈ ఓ లకు  ఇచ్చి రైతు బీమా ను నమోదు చేసుకోవాలని  రైతులకు విజ్ఞప్తి చేశారు.