నవతెలంగాణ-బోధన్ టౌన్ : బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమెర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ని బుధవారం రోజున ఉదయం ఎమ్మెల్సీ స్వగ్రామంలో కలిసి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కోసం కలవడం జరిగింది. బోధన్ నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ కవిత కి ఎమ్మెల్యే షకీల్ అమెర్ కోరడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత సానుకూలంగా స్పందించి కేటాయింపులు కోసం హామీ ఇచ్చారు.