నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ముప్పై గ్రామ పంచాయతిల గ్రామాలలో పరిశుభ్రత, సీజనల్ వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని యంపిడివో నరేష్, యంపివో యాదగిరి అన్నారు. శుక్రవారం రోజు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామాల పంచాయతి జూనియర్ సెక్రట్రిలతో సమావేశం నిర్వహించి గ్రామాలలో నెల కొన్న సమస్యల పైన ఎప్పడికప్పుడు పరిష్కరిస్తు ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో జేపిఎస్ లు తదితరులు పాల్గోన్నారు.