ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌…

నవతెలంగాణ – హైదరాబాద్
ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం సోమవారం శుభవార్త చెప్పింది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 2.73శాతం డీఏను పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ నెల నుంచి డీఏను పెంచింది. పెంచిన డీఏ 2022 జనవరి నుంచి అమలుకానున్నది. పెన్షనర్లు, ఉద్యోగుల మూలవేతనంలో రూ.2.73శాతం డీఏ పెరుగనున్నది. దీంతో 7.28లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్లకు లబ్ధి కలుగనున్నది. దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా డీఏ మంజూరు చేసినట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 7.28లక్షల మంది పెన్షనర్లు, ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. డీఏ పెంపుతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.974.16కోట్ల అదనపు భారం పడుతుందని, నెలకు రూ.81.18కోట్ల భారం పడుతుందని వివరించారు. పెంచిన డీఏ ప్రకారం.. రూ.1380.09 కోట్ల ఎరియర్స్‌ చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Spread the love