నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 234 పాయింట్ల లాభంతో 61,963.68 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 111 పాయింట్లు పెరిగి 18,314.40 పాయిట్ల వద్ద ట్రేడింగ్ ముసిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాల మధ్య బెంచ్ మార్క్ సూచీలు ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి సూచీలు పుంజుకున్నాయి. ట్రేడింగ్ సెషన్లో మార్కెట్లో ఐటీ, మెటల్ రంగ షేర్లలో పెరుగుదల కనిపించింది. నిఫ్టీ ఐటీ, మెటల్ సూచీలు రెండు శాతం లాభాలతో ముగిశాయి.