కొనసాగుతున్న గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె 

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
గ్రామపంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన నిరావధిక సమ్మె గురువారం 15 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. 15 రోజులు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దుర్గయ్య, శ్రీనివాస్, మామిడి సంపత్, శ్రీనివాస్, తాడూరి లక్ష్మి, సదానందం, నాగరాజు, కార్తీక్ , తిరుమల, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
Spread the love