నవతెలంగాణ-హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మూడు లారీలు, ఒక అశోక్ లే ల్యాండ్ వాహనం ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు లారీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. జూలూరుపాడు వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. మూడు లారీలు, ఒక అశోక్ లే ల్యాండ్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో లారీ డీజిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇక, ఈ ప్రమాదంలో రెండు లారీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.