– రోడ్డుపై కేజివీల్ నడిపితే కఠిన చర్యలు:సబ్ ఇన్స్పెక్టర్
నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండలంలోని పోతంగల్ గ్రామ శివారులో రోడ్డుపైన కేజీవీల్ ట్రాక్టర్ ను నడిపిన రెండు ట్రాక్టర్లను సీజ్ చేయడంతో పాటు ఇద్దరు ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేయడం జరిగిందని గాంధారి సబ్ ఇన్స్పెక్టర్ డి. సుధాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గాంధారి మండలంలోని పోతంగాల్ గ్రామానికి చెందిన వెనువర్దన్ రెడ్డి, చాకలి. సాయిలు తమ కేజీ వీల్ తో పోతాంగల్ గ్రామ శివారులో తారు రోడ్డుపై ట్రాక్టర్ నడుపుతుండగా పట్టుకొని సీజ్ చేసి, కేసునమోదు చేసామని అయన తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. తారు రోడ్డుపై కేజీ విల్ తో ట్రాక్టర్ నడపడం కారణంగా రోడ్లు పాడవుతున్నాయని అందుకే కేసు నమోదు చేయడం జరిగిందనీ అన్నారు. తారు రోడ్డుపై కేజీవీల్ తో ట్రాక్టర్లు నడిపితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కేజీ వీల్ తోతారురోడ్లపై ట్రాక్టర్లు నడిపితే పోలీసులకు సమాచారం అందించాలని అయన అన్నారు. కేజీవీల్ ట్రాక్టర్ లను సీజ్ చేయడం లో ఎస్సై వెంట ఏఎస్సై గణేష్, కానిస్టేబుల్ లుయాదగిరి, ప్రణీత్, భనుచందర్, దిలిప్ లు ఉన్నారు.