ఆన్‌లైన్‌లో నెహ్రూ జూలాజికల్‌ పార్కు సేవలు

– వెబ్‌సైట్‌, మొబైల్‌యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలా జికల్‌ పార్కులో మెరుగైన సేవ లు అందించేందుకు గానూ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ను రూపొందిం చామని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ రూపొందించిన నెహ్రూ జూ పార్క్‌ కొత్త వెబ్‌ సైట్‌, మొబైల్‌ యాప్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వెబ్‌సైట్‌లో సమస్త సమాచారాన్ని నిక్షిప్తం చేయడంతో పాటు సందర్శకులు సులువుగా జూ ఎంట్రీ టికెట్‌ బుకింగ్‌, బ్యాటరీ వెహికల్స్‌ ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://అఓజ్‌ూరటస.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సీజీజీ డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్ర నిమ్జే, పీసీసీఎఫ్‌, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌ ఆర్‌ఎం. డోబ్రియాల్‌, అటవీ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రశాంతి, పీసీసీఎఫ్‌ (ఎఫ్‌ఏసీ) ఎంసీ. పర్గయిన్‌, జూ పార్క్‌ డైరెక్టర్‌ వినరు కుమార్‌, క్యురేటర్‌ రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.