కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కార్మిక  ప్రజావ్యతిరేక కార్పొరేట్ అనుకూల బడ్జెట్ 

నవతెలంగాణ – హలియా
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ లక్ష్మీనారాయణ తుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కున్ రెడ్డి నాగిరెడ్డి లు విమర్శించారు. కాకులను కొట్టి గద్దలకు వేసే బడా కార్పొరేట్ బడ్జెట్ ను వ్యతిరేకించాలని సంయుక్త కిసాన్ మోర్చా,జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు బుధవారం హాలియా బస్టాండ్ సెంటర్ లో నిరసన వ్యక్తం చేసి *బడ్జెట్ ప్రతులను దగ్ధం* చేశారు. ఈ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని వారు అన్నారు. ఈ బడ్జెట్ ఆదానీ, అంబానీలకు మేలు చేసే విధంగా ఉందని, ఆర్ఎస్ఎస్, కార్పొరేట్ శక్తులు దేశ ప్రయోజనాలను,బడ్జెట్ ను తమకు అనుకూలంగా నిర్ణయించే స్థాయికి మోడీ ప్రభుత్వం దిగజారిందని అన్నారు. ఈ బడ్జెట్ లో విద్య,వైద్యంపై కేటాయింపులు జరగలేదని, అత్యధికంగాపేదలకు ఉపయోగపడే ఉపాధి హామీలో నిధులను పూర్తిగా తగ్గించి పేదల నోట్లో మట్టి కొట్టిందని వారు ఆరోపించారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు, కూటమి భాగస్వామ్య పక్షాల రాష్ట్రాలకు బడ్జెట్ లో కేటాయింపులు తప్ప మిగతా రాష్ట్రాలకుకేటాయించలేదని, బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించిందని ఆయన అన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం కేటాయించిన 63 వేల కోట్లు మాత్రమే ఉన్నదని, ఇంకా అదనంగా పెంచలేదని సంవత్సరానికి 200 పనిదినాలు పెంచుతూ రోజుకు కూలి 600 రూపాయలు ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపైన కనీస మద్దతు ధర పైన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పోరాటం చేస్తున్న రైతులకు కనీసం మద్దతు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వంవిఫలమైందన్నారు.ఒక దేశ ప్రధానిఇది పేదల బడ్జెట్ అని చెప్పటం ఎంత మోసపూరితమైన కుట్ర అని అర్థమైతుందన్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే రైలు సింగిల్ లైన్ కారణంగా నాలుగు ఐదు గంటల సమయం పడుతుందని అందుకని అనేక సంవత్సరాలుగా డబల్ ట్రాక్ ఏర్పాటు చేయాలి తెలుగు ప్రజలు కొట్లాడుతున్న ఆ ఉసే బడ్జెట్లో ఎత్తలేదని, మరి బిజెపి ఎంపీలు ఏం చేస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు.కేంద్ర మంత్రినిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకు మోకారిల్లె బడ్జెట్ లా ఉందని, విద్య వైద్యాన్ని విస్మరించారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోళ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని కనీస వేతనం 26,000 అమలు చేయాలని ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరింప చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను,సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అవుత సైదయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జె రవి నాయక్ ప్రజానాట్యమండలి జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ రామచంద్రయ్య, కెవిపిఎస్ జిల్లా నాయకులు దైద శ్రీను, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కారంపూడి ధనలక్ష్మి, వివిధ ప్రజా సంఘాల జిల్లా నాయకులు కందుకూరి కోటేష్, కోమండ్ల గురువయ్య, నల్లబోతు సోమయ్య, వేములకొండ పుల్లయ్య చిరు నాగార్జున దొరేపల్లి మల్లయ్య, కోరే రమేష్, రేవెల్లి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.