– మున్సిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్
నవతెలంగాణ – జమ్మికుంట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గురువారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 30వార్డులలో పరిసరాల పరిశుభ్రతతో పాటు డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు పాటించాలని పట్టణ ప్రజలకు మున్సిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్ అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడారు. వార్డులలో పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉన్న చోట దోమలు వ్యాపిస్తాయని, వార్డులలో నిల్వ ఉన్న ప్రాంతాలలో నీటిని బయటకు పంపి నీరు నిల్వ ఉంచకుండా చూడాలని, వాడే ప్రతి నీటిని మూతలతో మూసివేయాలని అన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు ప్రభలకుండా జాగ్రత్త పడాలని అన్నారు. పట్టణంలో గర్ల్స్ హై స్కూల్, మోత్కులగూడెం ప్రభుత్వ పాఠశాల, ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వైద్య, ఆరోగ్య అధికారులచే డెంగ్యూ, మలేరియా వ్యాధులు నివారణకు తీసుకోవాల్సిశాఖన జాగ్రత్తలు, వ్యాధులు ప్రభలితే తీసుకోవలసిన జాగ్రత్తలు ఆయన వివరించారు. వార్డులలో దోమలు రాకుండా ఉండేందుకు ఆయిల్ బాల్స్, ఫోగింగ్ చేస్తూనట్లు అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాశాఖ అధికారులు మోహన్ రెడ్డి, వైద్యులు మహోన్నత పటేల్, మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి, కౌన్సిలర్లు , మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ భాస్కర్, సానిటరీ ఇన్ స్పెక్టర్ సదానందం, వార్డ్ ఆఫీసర్స్, మెప్మా సి ఎల్ ఆర్పీలు, ఏఎన్ఎంలు, ఆర్పీలు, ఆశ వర్వర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.