ఫైలేరియా భాదితులకు వస్తువులు పంపిణీ

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్నూర్‌ మండలంలోని  కంచర్ల, కాచాపూర్, ఇసన్నపల్లి  గ్రామాలలో  ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు  నివారణ వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గాల్ రెడ్డి మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం  ఫైలేరియా వ్యాధి నివారణ లక్ష్యంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనె ఉద్దేశంతో  ఫైలేరియా వ్యాధి నివారణ కోసం  వస్తువులను పంపిణీ చేయడం జరుగుతుందని సూచించారు.  ఈ కార్యక్రమంలో  కాచాపూర్ గ్రామ సర్పంచ్  బైండ్ల సులోచన సుదర్శన్, కంచర్ల గ్రామ సర్పంచ్  చంద్రకళ మాధవరెడ్డి,  ఇసన్నపల్లి గ్రామ సర్పంచ్  రాములు, ఆయా గ్రామ పంచాయితీ కార్యదర్శులు  బాలరాజు, ప్రశాంత్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు,  వార్డు సభ్యులు,  తదితరులు పాల్గొన్నారు.