బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు

నవతెలంగాణ-భిక్కనూర్
బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మండలంలోని బస్వాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి దయాకర్ రెడ్డి సూచించారు. సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో బాల్య వివాహాల నివారణ పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడపిల్లలకు 18 సంవత్సరం వచ్చేవరకు వివాహాలు చేయవద్దని, బాల్యవివాహాలు జరిగితే అంగన్వాడీ టీచర్లు బాధ్యత వాయించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేష్ మంజుల మల్లారెడ్డి, ఉప సర్పంచ్ బిక్షపతి, ఎంపీటీసీ లీలావతి బాలా గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుర్రి గోపాల్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అమరావతి సిద్ధిరామిరెడ్డి, అంగన్వాడీ టీచర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.