వేసవిలో ఎండలు భగభగ మండుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి మండల ఎంపీడీఓ కే. శ్యాంసుందర్ ఆదేశాల మేరకు, మల్లారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గురువారం నూతనంగా చలివేంద్రం ఏర్పాటు చేసినట్లుగా పంచాయతీ కార్యదర్శి చెలుకల రాజు యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడారు వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా, గ్రామ ప్రజల సౌకర్యార్థం ,ప్రయాణికుల కోసం, బస్టాండ్ సమీపంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు, ప్రయాణికు లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సుమలత, గ్రామ ప్రజలు,గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.