మారుతి నగర్‌ సుబ్రహ్మణ్యం

విలక్షణ నటుడు రావు రమేష్‌ తొలిసారి నాయకుడిగా ప్రేక్షకుల ముందు రావడానికి రెడీ అవుతున్నారు. ఆయన టైటిల్‌ పాత్రలో పీబీఆర్‌ సినిమాస్‌ సంస్థ ప్రొడక్షన్‌ నెం.2గా రూపొందిస్తున్న సినిమా ‘మారుతి నగర్‌ సుబ్రహ్మణ్యం’. ఇందులో నటి ఇంద్రజ కీలక పాత్రధారి. ‘హ్యాపీ వెడ్డింగ్‌’ ఫేమ్‌ లక్షణ్‌ కార్య ఈ చిత్రానికి దర్శకుడు. శుక్రవారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు లక్ష్మణ్‌ కార్య మాట్లాడుతూ, ‘వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. రావు రమేష్‌ లీడ్‌ రోల్‌కి గ్రీన్‌సిగల్‌ ఇవ్వడం మా ఫస్ట్‌ సక్సెస్‌. నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులతో రెండు గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మార్చి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తాం’ అని తెలిపారు.