నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లో పని చేసే మేట్ల మండల నూతన కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గం ను ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గూగులోత్ ఈశ్వర్, ఉపాధ్యక్షులుగా దేగావత్ వినోద్, సంయుక్త కార్యదర్శి గా లకవాత్ ప్రకాష్, కార్యదర్శిగా అంగోత్ రవీందర్, క్యాషియర్ గా మూడెంట్ల నారాయణ, సలహాదారులు లావడ్య అరవింద్, బదవత్ ప్రకాష్, విస్లవత్ లలిత లతో మండల కమిటీ ని ఏర్పాటు చేశారు. సబ్యులుగా కేతవత్ పద్మ, దేవసోత్ నిర్మల ఎన్నికయ్యారు.