విజువల్‌ వండర్‌

సిజు విల్సన్‌ ప్రధాన పాత్రలో కాయాదు లోహర్‌ కథానాయికగా తెరకెక్కిన మలయాళం యాక్షన్‌ పీరియడ్‌ డ్రామా ‘పాథోన్‌పథం నూట్టండు’. వినయన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఆల్‌ ఇండియా ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌ పై సీనియర్‌ నిర్మాత సిహెచ్‌.సుధాకర్‌ బాబు ఈ చిత్రాన్ని ‘పులి’ అనే టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఎస్‌.కె రామచంద్రనాయక్‌ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ నిర్వహించిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌ ఈ చిత్ర ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు.నిర్మాత సుధాకర్‌ బాబు మాట్లాడుతూ, ‘గతంలో విడుదల చేసిన టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా చాలా హయ్యెస్ట్‌ రేటుపెట్టి కొన్నాను. ఈ సినిమాని చూసి ప్రసాద్‌ నాయక్‌ వాళ్ళ తండ్రిగారి పేరుతో సహా నిర్మాతగా చేరారు. పులి కొత్త అనుభూతిని ఇచ్చే సినిమా. పాటలు, యాక్షన్‌, విజువల్స్‌ అన్నీ అద్భుతంగా ఉంటాయి. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కొత్త అనుభూతిని పొందుతారు’ అని తెలిపారు. ‘చరిత్రలో చాలా నిజాలు దాగున్నాయి. అలా దాగున్న ఒక నిజాన్ని చూపించే చిత్రమిది. విజువల్స్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. కేరళలో ఈ సినిమా ఘన విజయం సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమా అద్భుతంగా ఆడుతుందని నమ్ముతున్నాను’ అని చెప్పారు.