‘ఈ మధ్య మనం థ్రిల్లర్, పేట్రియాటిక్, స్కామ్స్ నేపథ్యంలో సినిమాలు చూస్తున్నాం. వాటిలో కామెడీ మిస్ అయ్యాం. ఆ మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ మా ‘ధూం ధాం’ సినిమాలో చూస్తారు’ అని అంటున్నారు దర్శకుడు సాయికిషోర్ మచ్చా.
చేతన్ కష్ణ, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ధూం ధాం’. సాయికుమార్, వెన్నెల కిషోర్, పథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో డైరెక్టర్ సాయికిషోర్ మచ్చా చిత్ర విశేషాలను మీడియాతో షేర్ చేసుకున్నారు.
తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. దాంతో పాటు మంచి ప్రేమ కథ ఉంటుంది. తండ్రీ కొడుకుల అనుబంధం కారణంగా వల్ల నాయిక జీవితంలో ఒక అనుకోని ఘటన జరుగుతుంది. దాన్ని సరిదిద్దేందుకు హీరో ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది కథ. సినిమా సరదాగా మొదలై ఇంటర్వెల్ దాకా మంచి సాంగ్స్, లవ్ ట్రాక్తో ప్లెజెంట్గా వెళ్తుంది. ఇంటర్వెల్ నుంచి పెళ్లి ఇంట జరిగే సందడి మిమ్మల్ని హిలేరియస్గా నవ్విస్తుంది. వెన్నెల కిషోర్ సెకండాఫ్లో బాగా నవ్విస్తాడు.
యూరప్లోని పోలెండ్లో చిత్రీకరణ జరిపాం. అక్కడ కూడా మాకు ఇండియాలో ఉన్నట్లు భోజన, ఇతర వసతులు కల్పించారు నిర్మాత రామ్ కుమార్. ఆయన గురించి, ఆయన మంచితనం గురించి, సినిమా మీద ఉన్న ప్యాషన్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మా ప్రొడ్యూసర్కి మైత్రీ నవీన్ మంచి ఫ్రెండ్. ఆ రిలేషన్తో వారికి సినిమా చూపించాం. వారికి బాగా నచ్చి మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.
హీరో చేతన్ మంచి టాలెంటెడ్ హీరో. తండ్రి కోసం కొడుకు పడే ఆరాటాన్ని తన పాత్రలో చూస్తారు. కామెడీ, ఫైట్స్, రొమాంటిక్, ఎమోషనల్..ఇలా ప్రతి సీన్లో బాగా నటించాడు. అతనికి ఈ సినిమా మంచి ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది. హెబ్బా పటేల్ కూడా తన క్యారెక్టర్లో ఆకట్టుకునేలా నటించింది.
పరిశ్రమలో ఉన్న 80% నోటెడ్ ఆర్టిస్టులతోపాటు రామజోగయ్య శాస్త్రి, గోపీ సుందర్, మంగ్లీ స్క్రీన్ మీద మెరుస్తారు. గోపీ సుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. రీసెంట్ టైమ్స్లో ఇలాంటి ఛాట్ బస్టర్ ఆల్బమ్ రాలేదు. ఇందులో రామజోగయ్య శాస్త్రి సింగిల్ కార్డ్ రాశారు. మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయనకు సన్మానం చేస్తున్నాం.
ఈ సినిమా మీరు కొనే టికెట్ ధరకు విలువైన ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. రీసెంట్గా వైజాగ్లో పెయిడ్ ప్రీమియర్స్ వేశాం. ఆ ప్రీమియర్స్లో దాదాపు ప్రతి సీన్కు ప్రేక్షకులు బాగా నవ్వుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ సినిమా విజయంపై మరింత నమ్మకాన్ని పెంచింది.