నవతెలంగాణ – ముంబై: భారత్లోని దిగ్గజ లైఫ్ ఇన్సూరర్స్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ లైఫ్, 2023 జూన్ 7న తన అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ (AUM) ₹ 2.5 లక్షల కోట్లను అధిగమించడం ద్వారా మరో కీలక మైలురాయిని చేరుకుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ తన AUM విషయంలో స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది, 2015 నుంచి ప్రతి నాలుగేళ్లకోసారి అది దాదాపు రెట్టింపు అయింది. 2023 మార్చి 31 నాటికి, కంపెనీ డెట్:ఈక్విటీ రేషియో 70:30గా ఉంది అలాగే ~99% డెట్ పెట్టుబడులు ప్రభుత్వ బాండ్లలో ఇంకా AAA రేటింగ్ కలిగిన సెక్యూరిటీలలో ఉన్నాయి. బాధ్యతాయుతమైన పెట్టుబడులకు సారథిగా ఉన్న హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐక్యరాజ్యసమితి (యూఎన్) మద్దతు గల ప్రిన్సిపల్స్ ఫర్ రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ (PRI)పై సంతకం చేసింది, ఇది స్థిరమైన వృద్ధి అలాగే దీర్ఘకాలిక విలువను సృష్టించడం అనే తన లక్ష్యాలను సూచిస్తుంది.
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఎండీ & సీఈఓ విభా పడాల్కర్ దీనిపై వ్యాఖ్యానిస్తూ, ‘‘అపారమైన ఆనందంతో, మేము మా పాలసీదారులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము, ₹ 2.5 లక్షల కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ (AUM)ను అధిగమించడంలో వారి అచంచలమైన విశ్వాసం మరియు మద్దతు మాకు ఎంతగానో తోడ్పడింది. భారతీయులు ప్రగతిపథంలో పయనించడానికి అలాగే సురక్షితంగా ఉంచడానికి మాకు బలాన్నిస్తూ, వారు మాపై ఉంచిన నమ్మకానికి మేము వినయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భారతీయులందరికీ బీమాను కల్పించడానికి ముందుకు సాగుతున్నప్పుడు, మేము EPICC విలువలు (సమర్థత, ప్రజల భాగస్వామ్యం, సమగ్రత, వినియోగదారు కేంద్రీకృతం మరియు సహకారం)పై దృష్టి కేంద్రీకరించిన మా విజన్తో మార్గనిర్దేశం చేస్తాము’’ అని పేర్కొన్నారు.