ప్రస్తుతం ఆడియన్స్కి భాషతో సంబంధం లేకుండా ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్న కూడా చూడటం అలవాటు అయిపోయింది. రీసెంట్ టైమ్స్లో క్రిస్టి, ఇరట్ట, రోమాంచం వంటి మలయాళ సినిమాలు రిలీజై, మన తెలుగు ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈనెల 5న విడుదలైన మలయాళం సినిమా ‘2018’. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్టాక్తో ముందుకు సాగుతూ అత్యద్భుతమైన కలక్షన్స్ను రాబడుతోంది. ఈ సినిమా మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ కేవలం రూ.1.85 కోట్లు మాత్రమే. కానీ అనూహ్యంగా ఈ సినిమా మౌత్ టాక్ తోనే పదిరోజుల్లో వంద కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. 2018 ఆగస్టు నెలలో ఋతుపవనాల కారణంగా కురిసిన భారీ వర్షాలతో కేరళలో అధిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదల్లో సుమారుగా 164 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కేరళ చరిత్రలో సుమారు ఓ శతాబ్దంలో ఇవే అతి పెద్ద వరదలు అని చెప్పొచ్చు. దీనిని బేస్ చేసుకుని జూడ్ ఆంథనీ జోసెఫ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. కేరళలోని ఒక మారుమూల పల్లెటూరు నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. దొంగ మెడికల్ సర్టిఫికెట్తో ఆర్మీలో చేరి, అక్కడ ఉండడం ఇష్టం లేక పారిపోయి వచ్చే యువకుడిగా టోవినో థామస్ ‘అనూప్’ పాత్రలో కనిపిస్తాడు. కున్చాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, లాల్, అపర్ణ బాలమురళి.. లాంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో మనకు కనిపిస్తారు. ఇది పాన్ ఇండియా సినిమా కాకపోయినా సంచలనాలకు ఏ మాత్రం తగ్గడం లేదు. మలయాళంలో సంచలనం సష్టిస్తున్న ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను నిర్మాత బన్నీవాసు దక్కించున్నారు. త్వరలోనే ఆయన ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.