మూడు కమిషనరేట్ల పరిధిలో 26 సీడీఈడబ్ల్యూ కేంద్రాలు

– మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ శిఖా గోయెల్‌
నవతెలంగాణ-హయత్‌ నగర్‌
సేఫ్‌ సిటీ ప్రాజెక్ట్‌ కింద మహిళల సౌకర్యార్థం మూడు కమిష నరేట్ల పరిధిలో 26 సీడీఈడబ్ల్యూ కేంద్రాలను త్వరలో ప్రారంభిం చనున్నామని, భవిష్యత్తులో ప్రతీ ప్రధాన సబ్‌ డివిజన్‌లో సీడీఈడ బ్ల్యూ సెంటర్‌ ఉంటుందని మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ శిఖా గోయెల్‌ తెలిపారు. రాచకొండ కమిషనరేట్‌లో 5 సీడీఈడబ్ల్యు కేంద్రాల ప్రారంభోత్సవంలో వారు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ సమక్షంలో సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ (సీడీఈడబ్ల్యూ) / ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఎల్‌ బి నగర్‌ లో ఉన్న క్యాంప్‌ కార్యాలయం ఆవరణలో అవగాహన ప్రచార కార్యక్ర మాల కోసం అవుట్‌రీచ్‌ వ్యాన్‌ను ప్రారంభించారు. ఉప్పల్‌లో జాయింట్‌ సీపీ సత్యనారా యణ, కుషాయిగూడలో డీసీపీ (అడ్మిన్‌)ఇందిర, మీర్‌పేటలో డీసీపీ ఎల్‌బీ నగర్‌ సాయిశ్రీ, పహాడీషరీఫ్‌ లో డీసీపీ సైబర్‌ క్రైమ్స్‌ అనురాధ,డీసీపీ మహేశ్వరం శ్రీ శ్రీనివాస్‌ల చేతుల మీదుగా కమిష నరేట్‌లో ఒకేసారి 4 సీడీఈడబ్ల్యూ కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా శిఖా గోయెల్‌ మాట్లాడుతూ రాచకొండలో 5 సీడీఈడబ్ల్యూ కేంద్రాల ప్రారంభోత్సవంతో 15 సీడీఈడబ్ల్యూలు పని చేయగా, వచ్చే నెల మధ్య నాటికి మొత్తం 26 సీడీఈడబ్ల్యూలు పని చేయనున్నాయన్నారు. ఇప్పటివరకు స్థానిక పోలిస్‌ స్టేషన్‌ లలో లేదా భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్‌ జరిగిందని, అయితే కౌన్సెలింగ్‌ చాలా ప్రొఫెషనల్‌ సబ్జెక్ట్‌, సరైన రీతిలో సహాయం పొందడానికి కౌన్సెలర్‌లను నియమించాలని నిర్ణయించారు. పోలీసింగ్‌ను ఇంటి వద్దకు తీసుకురావడానికి కేంద్రాలు దగ్గరగా ఉండాలని నిర్ణయించారన్నారు.తద్వారా, మహిళలు దూరంగా ఉన్నా స్థానిక పోలిస్‌ స్టేషన్‌ లేదా భరోసా సెంటర్‌కు వెళ్లనవసరం లేదని, తమ ఇంటికి ఎక్కడికైనా రావచ్చు. అందుకే మూడు కమిషనరేట్లలో సీడీఈడబ్ల్యూ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక సన్నిహిత భాగస్వాముల వల్ల జరిగే హింసను మహిళలు ఫిర్యాదు చేయడం లేదని ఆమె అన్నారు. వైవాహిక సంబంధ కేసులలో సీడీఈడబ్ల్యు కేంద్రాల ద్వారా కుటుంబాలను ఒకచోట చేర్చడానికి ప్రయత్నం చేయబడుతుందని, మహిళలు సరైన మార్గదర్శకత్వం, సహాయం పొందవచ్చన్నారు. ఎక్కువ హింస జరిగినప్పుడు లేదా ఫిర్యాదుదారుల మధ్య రాజీ కుదరని చోట కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటారన్నారు. అన్ని సీడీఈడబ్ల్యు కేంద్రాలు తెలంగాణ మహిళా భద్రతా విభాగం ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ పర్యవేక్షణలో ప్రామాణిక ఫారమ్‌లు, ప్రోటోకాల్‌లతో ఒకే పద్ధతిలో పనిచేయడం జరుగుతుందన్నారు.
సీపీ మాట్లాడుతూ హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ ఏడీజీపీ మహిళా భద్రత, కమిషనర్లతో జరిగిన సమావేశంలో మహిళా సాధికారత, మహిళా రక్షణ, మహిళల భద్రత, గృహ హింస/బాహ్య హింస లేదా వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్రాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింద పేర్కొన్నారు. అందుకే, కమిషనరేట్‌లో ఏకకాలంలో 5 సడీఈడబ్ల్యూ కేంద్రాలు ప్రారంభించబడ్డాయన్నారు. త్వరలో మరో 2 ప్రారంభించడం జరుగుతుందన్నారు. బహిరంగ లేదా ఆన్‌లైన్‌ ఈవ్‌ టీజింగ్‌/వేధింపులను అరికట్టేందుకు సైబర్‌ స్టాకింగ్‌పై అవగాహన కార్యక్రమాలు, షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు.సిడిఇడబ్ల్యు కేంద్రాలు, షీ టీమ్‌ బృందాలు, మహిళల భద్రత, ఆన్‌లైన్‌ వేధింపులపై అవగాహన కల్పించేందుకు ఆడియో-వీడియో వ్యాన్‌ ఉపయోగించబడుతుందని పేర్కొ న్నారు.ఆన్‌లైన్‌, బహిరంగ సమాజంలో బాలికలు, మహిళల భద్రత కు భరోసా ఇవ్వడానికి రాచకొండ కమిషనరేట్‌ కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో డిసీపీ రోడ్డు భద్రత, మహిళా భద్రత శ్రీబాల, ఏసిపి ఎల్‌ బి నగర్‌ శ్రీధర్‌ రెడ్డి, ఏసీపీ షీ టీమ్స్‌ వెంకట్‌ రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ ఎల్‌బీ నగర్‌ అంజి రెడ్డి,సరూర్‌ నగర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మంజుల, సిబ్బంది పాల్గొన్నారు.