భారత్‌కు చేరుకున్న ‘ఆపరేషన్ అజయ్’ 2వ విమానం

నవతెలంగాణ- హైదరాబాద్: ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ అజయ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. నేడు ఉదయం మరో విమానం 235 మంది భారతీయులతో ఢిల్లీకి చేరుకుంది. భారత ప్రభుత్వం సొంత ఖర్చులతో ఈ చార్టెట్ విమానాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం తొలి విమానం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. తొలి విడతలో 212 మంది సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. ఈ విమానాల్లో భారత్ రావాలనుకునే వారు ముందులో తన పేరును రిజిస్టర్ చేసుకోవాలి. ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికే ప్రయాణం కల్పించేలా భారత్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆధారంగా ఈ ఫ్లైట్స్ నిర్వహిస్తోంది.