నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 455 దరఖాస్తులు అందాయి. రెవెన్యూపరమైన సమస్యలకు సంబంధించి 94, పౌరసరఫరాల శాఖకు సంబంధించి 77, విద్యుత్ శాఖకు సంబంధించి 45, హౌజింగ్కు సంబంధించి 44 దరఖాస్తులు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 40, ఇతర శాఖలకు సంబంధించి 155 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.