నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్ర మంలో 587 దరఖాస్తులందాయి. మైనారిటీ వెల్ఫేర్ శాఖకు 118, రెవెన్యూ పరమైన సమస్యలపై 94, విద్యుత్ శాఖకు 88, పౌరసరఫరాల శాఖకు 48, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 47, ఇతర శాఖలకు 192 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్కు వచ్చిన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.