ప్రజావాణికి 588 దరఖాస్తులు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్య క్రమంలో మొత్తం 588 దరఖా స్తులు అందాయి. మైనారిటీ వెల్ఫేర్‌ శాఖకు 221, పంచాయతీ రాజ్‌, గ్రామీ ణాభివృద్ధి శాఖకు 98, విద్యుత్‌ శాఖకు 84,రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 55, ప్రవాసీ ప్రజావాణి ద్వారా 4,ఇతర శాఖలకు 126, దరఖా స్తులు అందాయి. రాష్ట్ర ప్రణా ళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ డాక్టర్‌ చిన్నా రెడ్డి, ప్రజా పాలన ప్రత్యేకాధికారి దివ్య ఈ కార్య క్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీక రించారు. ప్రజాభవన్‌కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసు కున్నారు. ఈ మేరకు సమాచార,పౌరసంబంధాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.