నాని నటించిన హై-ఆక్టేన్ మాస్, యాక్షనర్ ‘దసరా’ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో రిమార్కబుల్ ఇంపాక్ట్ని చూపింది. శనివారం అత్యంత వైభవంగా జరిగిన 69వ శోభా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్లో ఆరు వేర్వేరు విభాగాలలో ఈ సినిమా అవార్డుల్ని కైవసం చేసుకుంది.
ధరణి క్యారెక్టర్లో అదరగొట్టిన నాని ప్రతిష్టాత్మకమైన ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. వెన్నెల పాత్రలో అత్యద్భుతమైన నటనకు గానూ కీర్తి సురేష్ ఉత్తమ నటి అవార్డును అందుకుంది.
తొలి డెబ్యూ డైరెక్టర్గా శ్రీకాంత్ ఓదెల ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమా డైనమిక్ విజువల్స్ను అందించడంలో అసాధారణమైన వర్క్కి గాను అవార్డు అందుకున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సినిమా సెట్స్, విజువల్ ఎన్విరాన్మెంట్ రూపొందించడంలో తన అద్భుతమైన పనితీరుతో అవార్డును అందుకున్నారు.
ఎనర్జిటిక్, ఎంగేజింగ్ ధూమ్ ధామ్ పాటకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ను అవార్డ్ అందుకున్నారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, ”ఒకప్పుడు నాకు చాలా అవార్డులు రావాలనే కోరిక ఉండేది. కానీ ఇప్పుడా ఆ కోరిక తగ్గింది. నాకు అవార్డుల కోసం ఇప్పుడు బలమైన కోరిక లేదు. ఇప్పుడు నా కోరికంతా నా దర్శకులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, నా సినిమాల్లో పరిచయమైన కొత్త టాలెంట్లు, ఇతర ఆర్టిస్టులు అవార్డులు అందుకోవాలనే. అదే నన్ను చాలా ఉత్తేజపరుస్తుంది. శ్రీకాంత్, శౌర్యువ్ అవార్డులు గెలుచుకున్నందుకు నేను స్పెషల్గా థ్రిల్ అయ్యాను. ఆ మూమెంట్లో నేనూ భాగం కావడం విశేషం. 2023 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ‘దసరా, హారు నాన్న’ రెండు బిగ్ బ్లాక్బస్టర్లు సాధించడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. నాని తాజాగా నటించిన ‘సరిపోదా శనివారం’ ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దసరాని అద్భుతంగా నిర్మించిన ఎస్ఎల్వి సిమాస్ నిర్మాత సుధాకర్ చెరుకూరి, నాని, శ్రీకాంత్ ఓదెల బ్లాక్బస్టర్ కాంబినేషన్లో మరొక యూనిక్, హై బడ్జెట్ మూవీ కోసం మరోసారి కొలాబరేషన్కి రెడీగా ఉన్నారు.