పైసాబజార్ లో 73% పెరిగిన ఎమ్ఎస్ఎంఇ రుణాలు

– మెట్రోతో పోలిస్తే నాన్ మెట్రో నగరాల్లో డిమాండ్ ఎక్కువగా వుంది
– రిటైలర్లు, వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లు మరియు తయారీదారులు గరిష్ట డిమాండ్‌కు కారణమయ్యారు
నవతెలంగాణ – హైదరాబాద్: కొనసాగుతున్న పండుగల సీజన్‌లో ఎమ్ ఎస్ ఎం ఇ వ్యాపార రుణాలకు డిమాండ్ బాగా పెరిగింది, దేశవ్యాప్తంగా ఇది  YOY (ఇయర్ ఆన్ ఇయర్ ) 73% పెరిగింది అని  వినియోగదారుల రుణాల  కోసం భారతదేశంలోని ప్రముఖ మార్కెట్‌ప్లేస్ అయిన పైసాబజార్ వెల్లడించింది.  భారతదేశం అంతటా ఎమ్ ఎస్ ఎం ఇ  వ్యాపార రుణాల కోసం డిమాండ్‌లో 73% పెరుగుదల క్యూ2 (జూలై-ఆగస్టు-సెప్టెంబర్) ఆర్ధిక సంవత్సరం 2024 సమయంలో కనిపించింది, సెప్టెంబర్2023 తో పోలిస్తే  డిమాండ్ 57% పెరిగింది దేశంలోని 700 నగరాల్లో పనిచేస్తున్న ఎమ్ ఎస్ ఎం ఇల నుండి తన ప్లాట్‌ఫారమ్‌లో సురక్షితం కాని  రుణాల కోసం డిమాండ్‌ను పైసాబజార్ విశ్లేషించింది. పండుగల సీజన్‌లో మెట్రో నగరాల కంటే నాన్-మెట్రో నగరాల్లో డిమాండ్ వేగంగా పెరిగింది. క్యూ2 ఫైనాసియల్ ’24 సమయంలో, నాన్-మెట్రో నగరాల్లో డిమాండ్ 74% మరియు మెట్రో నగరాల్లో 69% పెరిగింది. సెప్టెంబర్’23 నెలలో ఈ డిమాండ్ నాన్-మెట్రో నగరాల్లో 58% మరియు మెట్రో నగరాల్లో 52% పెరిగింది. పైసాబజార్ సహ-వ్యవస్థాపకుడు మరియు సిఇఓ నవీన్ కుక్రేజా మాట్లాడుతూ  “స్వయం ఉపాధి మరియు ఎమ్ ఎస్ ఎం ఇ  విభాగాలకు సంప్రదాయ పరంగా అవకాశాలు చాలా  తక్కువగా ఉన్నాయి, ఇది భారీ క్రెడిట్ గ్యాప్‌కు దారితీసింది. కానీ పెరుగుతున్న డిజిటలైజేషన్‌తో,  రుణాలు ఇచ్చే పరిశ్రమ విస్తరించడం తో  ఎమ్ ఎస్ ఎం ఇ ల వంటి విభాగాలు క్రెడిట్ కరువైన స్థితికి చేరుకోవడం మనం చూడాలి. . పైసాబజార్‌లో, మేము మరింత ఖచ్చితమైన ఆఫర్‌లు, ఉత్తమ ఉత్పత్తులు మరియు సౌకర్యవంతమైన  ప్రక్రియలతో వివిధ విభాగాల నుండి క్రెడిట్ కోసం పెరిగిన డిమాండ్‌ను చేరుకోవడంపై దృష్టి కేంద్రీకరించాము… ” అని అన్నారు.