పిడుగుపాటుకు 8 మంది మృతి

– మృతుల్లో నలుగురు చిన్నారులు
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాజ్నందగావ్‌ జిల్లా సోమ్ని పోలీసు స్టేషన్‌ పరిధిలోని జోరట్‌ రారు గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అదే సమయంలో ఓ ఇంటిపై పిడుగుపాటు పడటంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.