మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ స్టార్లతో హై-బడ్జెట్ ఎంటర్టైనర్లను నిర్మించడమే కాకుండా కంటెంట్-రీచ్ మూవీలను రూపొందిస్తోంది. గోవా, ఖాట్మండు మోఫిల్మ్ ఫెస్టివల్స్లో రెండుసార్లు ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుని విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం ‘మను’. ఈచిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఫణీంద్ర నర్సెట్టితో కాన్సెప్ట్ బేస్డ్గా ‘8 వసంతాలు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్కుమార్ హీరోయన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె పాత్రను శుద్ధి అయోధ్యగా పరిచయం చేశారు మేకర్స్. చెమ్మగిల్లిన కళ్లతో కదులుతున్న కవితలా, నవ్వుతూ కనిపించారు. కళ్లకు మాస్కరా, చెవిపోగులు, నోస్ రింగ్ ఆమెను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేశాయి. ఆమె సెన్సిబుల్ డాటర్, మంచి స్నేహితురాలు, అన్ కండీషనల్ లవర్, ఇంటెన్స్ మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్, ఇన్స్పైరింగ్ రైటర్, గ్రేస్ ఫుల్ హ్యూమన్ బీయింగ్. శుద్ధి అయోధ్య 19 ఏళ్ల నుండి 27 ఏళ్ల యువతి వరకు 8 సంవత్సరాల వ్యవధిలో విభిన్నమైన వ్యక్తులు, భావోద్వేగాలు, ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేయడంలో 8 వసంతాల ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని ప్రజెంట్ చేస్తోంది. ఆమె వ్యక్తిత్వం ఆమె పేరు శుద్ధిని ప్రతిబింబిస్తుంది. ఆమె జీవితంలోని ప్రతి అంశంలో ‘స్వచ్ఛత’గా ఉంటుంది. ఆమె మాటలు, ఆలోచనలు, పనులు, దయ డిగ్నిటీని ప్రజెంట్ చేస్తాయి. ‘షీ ఈజ్ ఏ పోయోట్రీ ఇన్ ఎమోషన్’ అంటూ ఆకట్టుకునే కోట్స్తో పాటు పోస్టర్లతో దర్శకుడు తన పొయిటిక్ సైడ్ని చూపించారు. టైటిల్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తూ అనంతిక ఫస్ట్-లుక్ పోస్టర్ 8 వసంతాల వరల్డ్ చూడాలని కోరుకునేలా చేస్తుంది. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వనాథ్ రెడ్డి డీవోపీ కాగా, నరేష్ కుమారన్ సంగీతం అందిస్తున్నారు. అరవింద్ ములే ప్రొడక్షన్ డిజైనర్గా, శశాంక్ మాలి ఎడిటర్గా, బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.