విఘ్నాలు తొలిగి ప్రజలు సుభిక్షంగా ఉండాలి

– ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి
నవతెలంగాణ- ఆలేరుటౌన్‌
గణనాధుని ఆశీస్సులతో విఘ్నాలు తొలిగి, నియోజకవర్గం లోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని , రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి తెలిపారు. సోమవారం వినాయక చవితి పురస్కరించుకొని ప్రభుత్వ విప్పు,ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత, డీసీసీబీచైర్మెన్‌ గొంగిడి. మహేందర్‌ రెడ్డి, సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా కార్యదర్శి లు, ఎండి.జహంగీర్‌, గోదా శ్రీరాములు, ఆలేరు మాజీ శాసనసభ్యులు డాక్టర్‌, కుడుదల. నగేష్‌, బూడిద బిక్షమయ్యగౌడ్‌, టి పీసీసీ రాష్ట్ర కార్యదర్శి లు జనగాం.ఉపేందర్‌ రెడ్డి ,బీర్ల. ఐలయ్య, కల్లూరి, రామచంద్రారెడ్డి, బీజేపీరాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదగాని హరిశంకర్‌ గౌడ్‌ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.