రూ.50 కోట్లకు మించి..

Rs.50
to crores
beyond..వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఇప్పటివరకు చూడని భయంకరమైన వైమానిక దాడులు, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే చిత్రంగా ఇది రూపొందుతోంది.
వరుణ్‌ తేజ్‌ బ్రేవ్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పైలట్‌గా నటిస్తున్న ఈ చిత్రం జాతీయ నేపథ్యంలో గ్రాండ్‌ స్కేల్‌ మేకింగ్‌తో భారీ బజ్‌ను సంపాదించింది. దీంతో ఈ సినిమా నాన్‌-థియేట్రికల్‌ హక్కులు, శాటిలైట్‌, డిజిటల్‌/స్ట్రీమింగ్‌, ఆడియో అన్ని భాషలకు సంబంధించిన ఇతర హక్కులతో సహా రూ. 50 కోట్లకి పైగా అమ్ముడయ్యాడని చిత్ర బృందం తెలిపింది.
వరుణ్‌ తేజ్‌కి ఇప్పటివరకు ఇదే బిగ్గెస్ట్‌ ప్రైస్‌. ఈ విజువల్‌ గ్రాండియర్‌తో వరుణ్‌ తేజ్‌ హిందీలో
అరంగేట్రం చేస్తుండగా, రాడార్‌ ఆఫీసర్‌ పాత్రను పోషించిన మానుషి చిల్లర్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినైసన్స్‌ పిక్చర్స్‌ నుండి సందీప్‌ ముద్దా నిర్మించారు. నందకుమార్‌ అబ్బినేని, గాడ్‌ బ్లెస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సహ నిర్మాతలు. యాడ్‌-ఫిల్మ్‌ మేకర్‌, సినిమాటోగ్రాఫర్‌, వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా, అమీర్‌ ఖాన్‌, సిద్ధార్థ్‌ రాజ్‌ కుమార్‌ రాసిన ఈ చిత్రం డిసెంబర్‌ 8న తెలుగు, హిందీలో విడుదల కానుంది.