కార్పొరేషన్లకు చైర్మెన్ల నియామకం : ఉత్తర్వులు జారీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మూడు కార్పొరేషన్లకు చైర్మెన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రైతు బంధు సమితి చైర్మెన్‌గా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, టీఎస్‌ ఆర్టీసీ చైర్మెన్‌గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ గా నందికంటి శ్రీధర్‌, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మెన్‌గా ఉప్పల వెంకటేష్‌ గుప్తాలు నియమితులయ్యారు.