ప్రత్యక్ష దైవం షిర్డిసాయి

దత్త ఫిలిమ్స్‌ నిర్మాణంలో మచ్చా రామలింగారెడ్డి షిర్డిసాయిగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ప్రత్యక్ష దైవం షిర్డిసాయి’. భానుచందర్‌, సీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్ర ఆడియో, వీడియో పాటల ప్రదర్శన ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. శ్రీభంసాయి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విశ్రాంత ఇన్‌ కంటాక్స్‌ ప్రిన్సిపల్‌ ఛీప్‌ కమీషనర్‌ నరసింహప్ప అధ్యక్షతన జరిగిన ఈ పాటల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దర్శకులు ఓం సాయి ప్రకాష్‌ మాట్లాడుతూ, ‘సాయితత్వాన్ని ప్రచారం చేయడానికే తనను కర్ణాటక పంపించారు. మచ్చా రామలింగారెడ్డి సాయిపాత్రను ధరించి సాయిభక్తుల అనుభవాలతో చిత్రం తీయడం అభినందనీయం’ అని చెప్పారు. చీఫ్‌ కమీషనర్‌ నరసింహప్ప మాట్లాడుతూ, ‘సాయితత్వాన్ని జనంలోకి తీసుకొనిపోవడానికి సినిమా మీడియా బాగా ఉపయోగపడుతుంది. యువతరంలో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ఈ చిత్రాన్ని మచ్చా రామలింగారెడ్డి నిర్మించడం గొప్ప విషయం. భక్తిరస చిత్రాన్ని యం.ఆర్‌.రెడ్డి నిర్మించడం అభినందనీయమని కమీషనర్‌ జీవన్‌ లాల్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు కొండవీటి సత్యం, నిర్మాతలు వెంకట్‌, సుబ్బారావు, సంగీతదర్శకులు కిషన్‌ కవాడియా రేలంగి నరసింహారావు, పాటల రచయిత బిక్కికష్ణ, ఎసిపి రామ్‌దాస్‌ తేజ, లయన్‌ డా.విజరు కుమార్‌, వి.డి.రాజగోపాల్‌, శ్రీమతి గిడుగు కాంతికష్ణ, తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.