మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీస్‌కి ప్రతిబింబం

A reflection of middle class familiesహీరో శివాజీ, వాసుకి ఆనంద్‌ సాయి ప్రధాన పాత్రలలో ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌ సిరిస్‌ ‘ఎట్‌ ది రేట్‌ నైన్టీస్‌’. ‘ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించే ఈ వెబ్‌ సిరిస్‌ని ఎంఎన్‌ఓపీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై రాజశేఖర్‌ మేడారం నిర్మిస్తున్నారు. నవీన్‌ మేడారం సమర్పిస్తున్నారు. వెంకటేష్‌ ఈ వెబ్‌సిరీస్‌ టీజర్‌ని బుధవారం లాంచ్‌ చేశారు. 90ల్లోని జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ టీవీలో ‘మనోరంజని’ కార్యక్రమాన్ని చూపిస్తూ టీజర్‌ ప్రారంభమైంది. దాదాపు రెండు నిమిషాల నిడివి గల టీజర్‌ ఆద్యంతం నవ్వులు పూయించింది. శివాజీ ఓ మిడిల్‌ క్లాస్‌ ఫాదర్‌, స్కూల్‌ టీచర్‌. అతని భార్య పాత్రలో వాసుకి నటించారు. వీరి ముగ్గురు పిల్లలు. ఈ కుటుంబం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు అలనాటి అందమైన జ్ఞాపకాలతో పాటు మధ్యతరగతి కుటుంబాల అనందాలు, సరదాలు, సంఘర్షణలను ఎంతో అందంగా, మనసుని హత్తుకునేలా చూపించాయి. ఈ సంక్రాంతికి ఈటీవీ విన్‌ యాప్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు ఈ వెబ్‌ సిరీస్‌ రానుంది అని మేకర్స్‌ తెలిపారు.