అమలవుతున్న సంక్షేమ పథకాలే కారు గుర్తుకు ఓటు బ్యాంక్‌

– మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల మైండ్‌బ్లాక్‌
– ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌
నవతెలంగాణ-కోదాడరూరల్‌
ఇంటింటికి పకడ్బందీగా అమలవుతున్న సంక్షేమ పథకాలే కారు గుర్తుకు ఓటు బ్యాంకు అని శాసనసభ్యులు బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. శనివారం మండలం లోని బీక్యాతండా, రామలక్ష్మీ పురం, ఎర్రవరం, గణపవరం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటివరకు జరిగిన అభివద్ధి బీఆర్‌ఎస్‌ వల్లే జరిగిందన్నారు. ఇకపై కూడా అభివద్ధి బీఆర్‌ఎస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నేను. ఎప్పుడూ ప్రజల సంక్షేమ అభివద్ధి కోసమే పాటు పడుతున్నానని తెలిపారు.బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో, మేనిఫెస్టో విడుదలలో, ప్రచారంలో ఎట్లైతే ముందు ఉందో రేపు జరిగే ఎన్నికల్లో కూడా విజయం సాధించడంలో బీఆర్‌ఎస్‌ ముందుంటుందన్నారు.బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల మైండ్‌ బ్లాక్‌ అయ్యిందన్నారు.కేసీఆర్‌ ప్రవేశపెట్టిన దళితబంధు, రైతుబంధు, ఉచిత కరెంటు, ఆసరా పెన్షన్‌ వంటి సంక్షేమ పథకాల పేర్లు మార్చి కాంగ్రెస్‌ గ్యారెంటీల పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు.అదే బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోకి, హామీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్యారెంటీ అన్నారు..తెలంగాణలో 93 లక్షల పైగా కుటుంబాలకు కేసీఆర్‌ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకం రూ.5 లక్షల బీమా ఇస్తామన్నారు.తెలంగాణ అన్నపూర్ణ పథకం పేరుతో తెల్ల రేషన్‌కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తుందన్నారు.ఆసరా పెన్షన్‌ రూ.2016 నుండి రూ.5016 పెంపు అధికారంలోకి మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016 చేస్తామన్నారు.వికలాంగుల పెన్షన్‌ రూ.4016 నుండి రూ.6016 పెంపు,రైతుబంధు పథకం ఎకరానికి రూ.10,000 నుండి రూ.16,000 వేలకు పెంపు,మొదటి సంవత్సరం ఎకరానికి రూ.12,000 చొప్పున ఇచ్చి పెంచుతూ రూ.16,000 ఇవ్వడం జరుగుతుందన్నారు.సౌభాగ్య లక్ష్మీ పథకం అర్హులైన ప్రతి మహిళకు రూ.3,016లు భతి ఇస్తామన్నారు.అర్హులైన వారికి రూ.400లకే గ్యాసి సిలిండర్‌,అక్రిడిటేషన్‌ కార్డున్న ప్రతి జర్నలిస్ట్‌ కుటుంబానికి రూ.400లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు.ఆరోగ్య లక్ష్మీ పెంపు ఆరోగ్య లక్ష్మీ రూ.15లక్షలకు పెంచడం జరుగుతుందన్నారు.బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం,దళితబంధు కొనసాగుతుందన్నారు.కర్నాటకలో కాంగ్రెస్‌ గ్యారంటీలు పూటకొకటి ఎగిరిపోతున్నాయన్నారు.ఆరునెలలకే కర్ణాటక అతలాకుతలం అవుతున్నదన్నారు.ఈకార్యక్రమంలో మాజీ ఇన్‌చార్జి శశిధర్‌రెడ్డి,ఎంపీపీ చింతకవిత రాధారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు బానోత్‌ అంబేద్కర్‌, పాముల మస్తాన్‌, పొట్ట శ్రీ విజయ కిరణ్‌, మండల నాయకులు, సొసైటీ చైర్మెన్‌, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.