ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే సినిమా

ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే సినిమాహన్సిక కథానాయికగా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శతి’. శ్రీనివాస్‌ ఓంకార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మిస్తున్నారు. ఈనెల 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా శనివారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా శ్రీనివాస్‌ గౌడ్‌, డైరెక్ట్‌ చేసిన అశోక్‌ విచ్చేసి, చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. హన్సిక మాట్లాడుతూ, ‘ఇదొక గ్రేట్‌ సబ్జెక్ట్‌ థ్రిల్లర్‌. నా మనసుకు ఎంతో దగ్గరైనా కథ. డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ఓంకార్‌ చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు.
వైష్ణవి ఆర్ట్స్‌ సంస్థ ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా నిర్మించారు. ప్రభాకర్‌ ఫ్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాతో మరోసారి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని చెప్పారు. ‘హన్సిక ఈ కథను బలంగా నమ్మారు. అలాగే స్క్రిప్ట్‌తో పాటు నన్ను అర్థం చేసుకున్న టెక్నీషియన్స్‌ దొరకడం నా అదష్టం. ఇందులోని సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. రాబిన్‌ అద్భుతమైన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. ప్రొడ్యూసర్‌ చేసిన సపోర్టును మర్చిపోలేను’ అని దర్శకుడు శ్రీనివాస్‌ ఓంకార్‌ తెలిపారు.
నిర్మాత ప్రభాకర్‌ మాట్లాడుతూ, ‘సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన హన్సికకి థ్యాంక్స్‌’ అని తెలిపారు.