ఎంపీలో ధనిక బీజేపీ ఎమ్మెల్యే

–  చైతన్య కశ్యప్‌ వద్ద రూ.296 కోట్ల సామ్రాజ్యం.
ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గానూ 2,534 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2018 సంపన్న ఎమ్మెల్యేలలో ఒకరైన బీజేపీ అభ్యర్థి చైతన్య కశ్యప్‌ ఈసారి కూడా రత్లాం జిల్లాలోని రత్లాం సిటీ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు.ప్రస్తుత ఎమ్మెల్యేలలో అత్యంత ధనిక ఎమ్మెల్యే సంజరు పాఠక్‌. చైతన్య కశ్యప్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఈసారి వారిద్దరూ దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం.. పాఠక్‌ కంటే చైతన్య కశ్యప్‌ సంపద ఎక్కువైపోయింది. ఈ అఫిడవిట్‌లో చెతన్య కశ్యప్‌ పేరిట రూ.296 కోట్లకు పైగా ఆస్తులు ఉండగా, సంజరు పాఠక్‌కు రూ.242 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. కశ్యప్‌ ఎన్నికల అఫిడవిట్‌లో ఇంకా ఏముందో తెలుసుకుందాం…
ఐదేండ్లలో సంపద ఎంత పెరిగిందంటే?
బీజేపీ ఎమ్మెల్యే చెతన్య కశ్యప్‌ తన అఫిడవిట్‌లో మొత్తం ఆస్తుల విలువ రూ.296.08 కోట్లుగా ప్రకటించారు. 2018 ఎన్నికల్లో ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.204 కోట్లు. పదేండ్ల కిందట అంటే 2013లో చెతన్య మొత్తం ఆస్తుల విలువ రూ.120 కోట్లు. ఈ విధంగా పదేండ్లలో ఆయన సంపద రూ.176 కోట్లకు పైగా పెరిగింది.2018 ఎన్నికల్లో గెలిచిన అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో చైతన్య కశ్యప్‌ పేరు రెండో స్థానంలో ఉంది. 2018లో ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 204 కోట్లుగా ప్రకటించారు. ఆ సమయంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా బీజేపీ ఎమ్మెల్యే సంజరు పాఠక్‌, కట్నీలోని విజయరాఘవగర్‌ స్థానం నుంచి గెలుపొందారు. ఆ సమయంలో పాఠక్‌ తన మొత్తం సంపద రూ.226 కోట్లుగా ప్రకటించారు. ఈ ఎన్నికల అఫిడవిట్‌లో పాఠక్‌ తన మొత్తం సంపద రూ.242 కోట్లుగా ప్రకటించారు. అదే సమయంలో, కశ్యప్‌ అతని కంటే ముందు వెళ్ళారు.ప్రతి సంవత్సరం చెతన్య కశ్యప్‌ , అతని భార్య నీతా వార్షిక ఆదాయం గురించి చెప్పాలంటే, ఇది కోట్లలో ఉంది. 2018-19లో కశ్యప్‌ కుటుంబం మొత్తం ఆదాయం రూ. 1.02 కోట్లు. తర్వాతి ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు క్షీణించాయి. 2019-20లో రూ.88.74 లక్షలకు తగ్గింది. 2020-21లో కుటుంబ ఆదాయం రూ.1.07 కోట్లకు పెరిగింది. అదే సమయంలో 2021-22లో మళ్లీ వసూళ్లు భారీగా పెరిగి రూ.1.28 కోట్లకు చేరుకున్నాయి. కాగా 2022-23లో రూ.1.35 కోట్లు ఆర్జించింది.
రత్లాం-ముంబైలో 16 బ్యాంకు ఖాతాలు
అఫిడవిట్‌ ప్రకారం బీజేపీ ఎమ్మెల్యే, ఆయన కుటుంబం వద్ద రూ.1,08,815 నగదు ఉంది. బీజేపీ నాయకుడు , అతని కుటుంబ సభ్యులకు రత్లాం , ముంబైలో మొత్తం 16 బ్యాంకు ఖాతాలు ఉన్నాయి, వీటిలో మొత్తం డిపాజిట్లు రూ. 1.43 కోట్లు.చెతన్య కశ్యప్‌కు కంపెనీల్లో షేర్లు, రూ.42.264 లక్షల విలువైన నిధులు ఉన్నాయి. ఇది కాకుండా ఎమ్మెల్యే రూ.60వేలు బీమా ప్రీమియం జమ చేశారు.