ఒకరి రక్తదానం, ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది. ప్రమాద బాధితులు, శస్త్రచికిత్స, క్యాన్సర్ రోగుల నుండి గర్భవతులు, ప్రసవ సమయంలో మహిళలకు , రక్తహీనత ఉన్న పిల్లలకు అవసరమైన రక్తమార్పిడి తగిన సమయంలో జరగడానికి దోహద పడుతుంది మరియు ఆలస్యాన్ని నివారించడంలో సహాయపడుతుంది • ఈ ప్రచారం అబాట్ యొక్క BETHE1™ గ్లోబల్ డోనర్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్లో భాగం మరియు భారతీయ హిప్-హాప్ కళాకారుడు MC హెడ్షాట్ పాట – “గివ్ బ్లడ్, గెట్ గుడ్ వైబ్స్” ను కలిగి వుంది • ఈ పాట రక్తదానం చేయడానికి యువతను ప్రేరేపించే లక్ష్యంతో ఉంది. 85.5% భారతీయ యువకులు (18-25 సంవత్సరాల వయస్సు వారు) ఎన్నడూ రక్తదానం చేయలేదని నివేదికలు ఉటంకిస్తున్నాయి.
నవతెలంగాణ ముంబై: భారతదేశం గణనీయంగా పురోగమిస్తున్నప్పటికీ, దేశానికి అవసరమైన రక్త సరఫరాలో ఇప్పటికీ అంతరం ఉంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం, భారతదేశానికి ప్రతి సంవత్సరం సగటున 14.6 మిలియన్ల రక్త యూనిట్లు అవసరమవుతాయి, అయితే ఏటా దాదాపు ఒక మిలియన్ యూనిట్ల స్థిరమైన కొరత కలిపిస్తుంది. ఈ సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపుతూ , గ్లోబల్ హెల్త్కేర్ లీడర్ అబాట్, తమ ప్రపంచవ్యాప్త దాతల నియామక ప్రచారం ‘BETHE1,’ ను విస్తరించింది, మరియు మొట్టమొదటిసారిగా రక్త దాతల కోసం ప్రచార గీతం ‘గివ్ బ్లడ్… గెట్ గుడ్ వైబ్స్ ‘ను విడుదల చేసింది. ఈ పాట భారతీయ యువతను రక్తదానం చేసేలా ప్రేరేపించడం తో పాటుగా ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడానికి సమకాలీనమైన, మెరుగైన విధానంగా రక్తదానం ను చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ హిప్-హాప్ కళాకారుడు, రాపర్, గీత రచయిత , రంగస్థల ప్రదర్శనకారుడు అయిన MC హెడ్షాట్ గా పిలువబడే తమోజిత్ ఛటర్జీ స్వరాలు అందించారు.
ఈ కార్యక్రమం గురించి MC హెడ్షాట్ మాట్లాడుతూ, “ఈ ప్రచారంలో భాగమైనందుకు నేను గర్విస్తున్నాను, ఎందుకంటే ఇది వాస్తవ జీవిత సవాలును పరిష్కరించడంలో సహాయపడటం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ ఉన్న యువకులందరికీ కూడా తాము మార్పు చేయగలమని అవగాహన పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను. మీరు ఆరోగ్యంగా ఉండి, రక్తదానం చేయగలిగిన స్థితిలో ఉంటే , అది చేయమని , ప్రాణాలను కాపాడేందుకు సహాయం చేయడానికి ముందుకు రావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను… ” అని అన్నారు. రక్తదానాన్ని ప్రోత్సహించడానికి ముందుగా నిర్వహించిన ఆన్-గ్రౌండ్ ప్రయత్నాలకు ఈ ప్రచారం అనుబంధంగా ఉంటుంది. డిజిటల్ మరియు భౌతిక మార్గాలు, మొబైల్ డొనేషన్ వ్యాన్లు మరియు మరిన్నింటితో సహా ముంబై, హైదరాబాద్, కోల్కతా, కొచ్చి, నాగ్పూర్, వైజాగ్, గౌహతి, నాగ్పూర్, నాసిక్లతో పాటు భారతదేశంలోని 19 ప్రధాన నగరాలలో కంపెనీ తమ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సైట్లు సుమారుగా 300,000 వార్షిక విరాళాలను నమోదు చేశాయి.
ఈ సంవత్సరం విరాళాలు 20% పైగా పెరిగాయి. ఈ సందర్భంగా ఒగిల్వీ ఇండియా నేషనల్ హెడ్ పీఆర్ & ఇన్ఫ్లుయెన్స్ ఆర్నీతా వాసుదేవ మాట్లాడుతూ.. ‘‘ప్రాణాలను రక్షించడం కంటే మిన్న అయినది ఏదీ లేదు. ‘గివ్ బ్లడ్… గెట్ గుడ్ వైబ్స్ ‘, అనేది యువతతో కనెక్ట్ అవ్వాలనే ఆలోచనతో మేము చేసిన ర్యాప్ కంపోజిషన్. మన దైనందిన జీవితంలో రక్తదానం ఒక భాగంగా చేయడంలో అవసరమైన మార్పును తీసుకురావటం లో ఇది తోడ్పడనుంది. ఈ కార్యక్రమంతో, దాత కోసం తీసుకువచ్చే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజలలో మెరుగైన అవగాహనను కూడా చూడాలని మేము ఆశిస్తున్నాము…” అని అన్నారు. భారతదేశం యొక్క డిమాండ్-సరఫరా అంతరం: రక్తదానం లోటు భారతదేశం లో 402 మిలియన్ల మంది అర్హులైన దాతలు వున్నారు.
అయినప్పటికీ దేశ జనాభాలో 1% మంది రక్తదానం చేయాలనే WHO యొక్క కనీస స్థాయి సిఫార్సును కూడా అందుకోలేకపోయింది. 2022లో దేశంలోని రక్త సరఫరా ప్రతి వెయ్యి రక్త దానాలకు కి 33.8గా అంచనా వేయబడింది, కానీ ప్రతి వెయ్యికి డిమాండ్ మాత్రం 36.3 గా వుంది. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ & మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, హిస్టోకాంపాటబిలిటీ & ఇమ్యునోజెనెటిక్స్ కన్సల్టెంట్ డాక్టర్ రాజేష్ బి సావంత్ మాట్లాడుతూ, “ఒకసారి చేసే రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది మరియు రక్తదానం చేసే ప్రక్రియకు సాధారణంగా 45 నిమిషాలు నుంచి ఒక గంట మాత్రమే పడుతుంది. అవసరమైన వ్యక్తులకు క్లిష్టమైన రక్తమార్పిడిలో జాప్యాన్ని నివారించడంలో సహాయపడటానికి భారతదేశం యొక్క రక్త లోటు సమస్యను పరిష్కరించడం తక్షణ అవసరం. రక్తదానం గురించి అవగాహన పెంచడం, అపోహలను పోగొట్టడం ద్వారా ఇది చేయవచ్చు, ప్రత్యేకించి రక్త సరఫరా కోసం నిరంతరం అవసరం పెరుగుతూనే వుంది.
అత్యవసర పరిస్థితులకు మాత్రమే కాకుండా, ప్రణాళికాబద్ధమైన శస్త్రచికిత్సలు, దీర్ఘకాలిక వైద్య చికిత్సల కోసం కూడా దీని అవసరం ఎక్కువగానే వుంది” అని అన్నారు. స్వచ్ఛంద రక్తదానం ముఖ్యంగా కొన్ని సమూహాలలో చాలా తక్కువగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువత కలిగిన దేశాలలో ఒకటిగా భారతదేశం నిలిచినప్పటికీ 85.5% భారతీయ యువత (18-25 సంవత్సరాల వయస్సు వారు) ఎన్నడూ రక్తదానం చేయలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతే కాకుండా , 10 నుండి 12% మహిళలు మాత్రమే రక్తదాతలు. దీనికి కారణాలు చూస్తే తక్కువ అవగాహన, రక్తహీనత, రక్తదానం తమ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందనే ఆందోళన, ఈ ప్రక్రియపై స్పష్టత లేకపోవటం మరియు రక్తదానం చేసే సైట్లకు చేరుకోవటానికి తగిన మార్గాలు లేకపోవటం వంటివి కనిపిస్తాయి. రక్తదానం అనేది శక్తివంతమైన, ప్రాణాలను రక్షించే ప్రవర్తన – గర్భందాల్చిన, ప్రసవ సమయంలో (ప్రసవానంతర రక్తస్రావం వంటివి), తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలకు, ప్రమాద బాధితులు, శస్త్రచికిత్స , క్యాన్సర్ రోగులకు మద్దతుగా ఉన్న మహిళలకు చికిత్స చేయడంలో కీలకం. దీనితో పాటు, సాధారణ రక్తదానం కూడా శరీరంలో ఆరోగ్యకరమైన ఐరన్ స్థాయిలను నిర్వహించడంలో మరియు కొత్త రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ నిస్వార్థ చర్య ప్రాణాలను కాపాడటమే కాకుండా దాతకు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం, తక్కువ రక్తపోటు, మెరుగైన మానసిక స్థితి, ఆరోగ్యకరమైన కాలేయం మరియు మెరుగైన ప్లాస్మా లిపిడ్ ప్రొఫైల్లతో సహా మరెన్నో ప్రయోజనాలను కూడా అందిస్తుంది. , ఇది ఒకరి జీవితంలో మార్పు తీసుకురావడానికి, ప్రతిఫలంగా కృతజ్ఞతను అందుకోవడానికి సులభమైన మార్గం. రక్త కొరతను పరిష్కరించడం అబాట్ యొక్క గ్లోబల్ ప్రోగ్రామ్ BETHE1 ‘గివ్ బ్లడ్. గెట్ బ్యాక్.’ ప్రచారం ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ స్టేట్స్, ఇథియోపియా వంటి దేశాలలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఐరోపాలో, ఈ ప్రచారం జర్మనీ, ఇటలీ, గ్రీస్తో సహా అర డజనుకు పైగా దేశాలలో సంభావ్య దాతలను చేరుకుంది. భారతదేశంలో, యువత వంటి తక్కువ మొత్తంలో రక్తదాతల సంఖ్య కలిగిన గ్రూప్ లను చేరుకోవటానికి, సృజనాత్మక ఫార్మాట్ల ద్వారా సానుకూల ప్రవర్తనను తీసుకురావటానికి అబాట్ కృషి చేస్తోంది.