– హెచ్ఎం లకావత్ పద్మ, టీఎస్ యుటిఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి ఈసం బుచ్చయ్య
నవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-తాడ్వాయి : నిరంతరం ప్రజా సమస్యలపై ప్రచురితమయ్యే వార్తలను ప్రచురించే దినపత్రిక నవతెలంగాణ దినపత్రిక అని ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాల తాడ్వాయి హెచ్ఎం లక్కావత్ పద్మ, టీఎస్ యుటిఎఫ్ ములుగు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఈసం బుచ్చయ్య లు అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఉపాధ్యాయ నాయకులతో కలిసి నవతెలంగాణ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికలో ఉన్నది ఉన్నట్టుగా నికచ్ఛితంగా వార్తలు రాసే ఏకైక పత్రిక నవ తెలంగాణ దినపత్రిక అని అన్నారు.ప్రతి నిత్యం ప్రజా సమస్యలపై ప్రజల సమస్యలు వెలికితీసే దినపత్రిక అని కొనియాడారు. నిజాన్ని నిర్భయంగా రాయడంలో నవతెలంగాణ ముందుంటుందని అన్నారు. కార్మిక, కర్షక, శ్రామిక, రైతుల, పేదల, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నవతెలంగాణ పత్రిక నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. గత ఏడాది మంచి చెడులను మరచి కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఉద్యోగ నాయకులు ఈసం సీతమ్మ, పాయం గోపాల్, జవహర్లాల్, సరళ తదితర ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు.