ఫిబ్రవరి 23న రిలీజ్‌కి రెడీ

ఫిబ్రవరి 23న రిలీజ్‌కి రెడీ‘కాలింగ్‌ బెల్‌’, ‘రాక్షసి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ హర్రర్‌ సినిమాల తర్వాత దర్శకుడు పన్నా రాయల్‌ రూపొందించిన మరో హర్రర్‌ అండ్‌ మిస్టీరియస్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఇంటి నెం.13’. రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై డా. బర్కతుల్లా సమర్పణలో హేసన్‌ పాషా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి 23న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు పన్నా రాయల్‌ మాట్లాడుతూ, ‘ఆడియన్స్‌కి ఒక డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే సినిమా ఇది. ఇప్పటివరకు సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ చాలా వచ్చాయి. కానీ, ఈ సినిమాలోని యూనిక్‌ పాయింట్‌ ఆడియన్స్‌ని మెస్మరైజ్‌ చేస్తుంది. ప్రతి పది నిమిషాలకు వచ్చే ట్విస్ట్‌తో ఆడియన్స్‌కి గూస్‌బంప్స్‌ గ్యారంటీ. ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసేందుకు హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో ఓ విజువల్‌ వండర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాం. మా నిర్మాత హేసన్‌ పాషా ఖర్చుకు వెనకాడకుండా చాలా రిచ్‌గా ఈ సినిమాని నిర్మించారు’ అని అన్నారు. ‘మా దర్శకుడు పన్నా రాయల్‌ ఈ చిత్ర కథ చెప్పినపుడు చాలా ఎగ్జైట్‌ అయ్యాను. తప్పకుండా ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. పన్నా టేకింగ్‌, ఫుటేజ్‌ చూసిన తర్వాత నా నమ్మకం రెట్టింపు అయ్యింది’ అని నిర్మాత హేసన్‌ పాషా చెప్పారు.