
మండలంలో ఇరిగేషన్ శాఖలో లస్కర్ గా విధులు నిర్వహిస్తూ సరైన సమయానికి జీతాలు రాక, ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది గురువారం గుండె పోటు తో పెద్దగోని యాదయ్య మృతి చెందారు. యాదయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, పూర్వపు విఆర్ఏ హక్కుల సాధన సమితి రాష్ట్ర కో చైర్మన్ దాసరి వీరన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హెల్పర్, లస్కర్ గా నియమించిన వారికి ఎంప్లాయిస్ గుర్తింపు సంఖ్య, వేతనాలు త్వరగా వచ్చేవిదంగా చూడాలి అని అధికారులను వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మేకల యాదగిరి, చిత్తలూరి స్వామి, సాయి మల్లు,స్వామి, కానుగుల శ్రీనివాస్,ఎడ్ల వెంకన్న,బుంగ చరణ్ రాజ్, ఈదుల బాలస్వామి, బందెల వీరస్వామి,దొడ్డి ప్రేమయ్య, కడారి సత్తయ్య,తదితరులు పాల్గొన్నారు.