నవతెలంగాణ – భువనగిరి రూరల్
ఇటీవల ఆత్మహత్యలకు గురైనటువంటి భవ్యశ్రీ , వైష్ణవి లకు తక్షణ విచారణ జరిపి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం యాదాద్రి భువనగిరి అదనపు జిల్లా కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లకు వేరువేరుగా వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆత్మహత్యలు పాల్పడేటువంటి భవ్య శ్రీ వైష్ణవి లకు ప్రభుత్వం నుంచి రావలసినటువంటి ఎక్స్ గ్రేషియా వెంటనే ఇప్పించాల్సిందిగా, సత్వర విచారణ జరిపి, వారు ఇరువురి ఆత్మలకు శాంతి చేకూర్చే విధంగా దోషులకు కఠినంగా శిక్ష పడే విధంగా సత్వర విచారణ జరిపి మృతులకు రావలసినటువంటి ఎక్సిగ్రేషియా గాని, విచారణలో ఏమాత్రం వలసత్వం లేకుండా చేస్తామని కలెక్టర్,డీసీపీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ అధ్యక్షులు శెట్టి బాలయ్య యాదవ్, జిల్లా నాయకులు వేల్పుల యాదమల్లయ్య, కౌన్సిలరు వడిచెర్ల లక్ష్మి కృష్ణ యాదవ్, ఊదర నరసింహ యాదవ్, కడారి మల్లేష్ యాదవ్, డేగల అంజయ్య, మోటకొండూరు మండల అధ్యక్షులు మాధర బోయిన నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు రాజు, రాసాల లింగస్వామి, బీబీనగర్ మండల అధ్యక్షులు సాయికుమార్ యాదవ్ , వలిగొండ మండల అధ్యక్షులు వనగంటి వెంకటేశ్ యాదవ్ , రాసాల వినోద్ యాదవ్, బీన బోయిన కుమార్ యాదవ్, మేకల బాలు యాదవ్, గుండబోయిన శంకర్ యాదవ్, యాదవ సంఘం పట్టణ, జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.