– హైకోర్టు న్యాయమూర్తి రాకేశ్ కుమార్ తీర్పులోని అంశాలను పక్కన పెట్టిన సుప్రీం న్యూఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కఠిన పదజాలంతో వ్యాఖ్యలు చేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ రాకేశ్ కుమార్ 2020 డిసెంబర్ 31 ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బేలా ఎం త్రివేది, పంకజ్ మిథాల్లతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల్లోని అన్ని వివాదాస్పద పరిశీలనలను పక్కనబెట్టింది.
ప్రభుత్వ భూములను వేలం వేయడాన్ని సవాలు చేసే కేసు నుండి న్యాయమూర్తిని తప్పుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన తిరస్కరణ దరఖాస్తుకు ప్రతిస్పందనగా జస్టిస్ రాకేశ్ కుమార్ తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలో, జస్టిస్ కుమార్ ఇద్దరు ప్రధాన న్యాయమూర్తుల బదిలీకి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని విమర్శించారు. తన తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేశారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని పరిపాలన వ్యవస్థ హైకోర్టును అణగదొక్కే ప్రయత్నాలకు కారణమైందని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థల పనితీరులో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. ముఖ్యమంత్రిపై క్రిమినల్ కేసుల పరిష్కారంలో జాప్యంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. న్యాయమూర్తి నిజాయితీ, చిత్తశుద్ధి, నిష్పాక్షికతపై ఎలాంటి సహేతుకమైన ఆధారం లేకుండా ప్రశ్నలు తలెత్తినప్పుడు, న్యాయమూర్తి తన రక్షణలో వివాదాస్పద వాస్తవాలను ప్రస్తావించే హక్కును కలిగి ఉంటాడని తీర్పులో నొక్కి చెప్పారు. ఎవరైనా న్యాయమూర్తిపై ఫిర్యాదు చేసినట్లయితే, పరిష్కారం పెద్ద బెంచ్ లేదా పైకోర్టు ముందు ఉంటుందని పేర్కొన్నారు. సరైన ప్రాతిపదిక లేకుండా న్యాయమూర్తిని కించపరిచే ఏదైనా ఫిరాయింపులు లేదా సాహసం ధిక్కారమేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ ”చాలా కష్టంగా” మారిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం మరింత పారదర్శకంగా ఉండాలని, హైకోర్టు న్యాయమూర్తులు కూడా రాజ్యాంగబద్ధమైన పదవులను కలిగి ఉన్నారనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఈ వ్యాఖ్యలను ఇప్పుడు సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, నిరంజన్ రెడ్డి, న్యాయవాది మహఫూజ్ అహ్సన్ నజ్కీ వాదనలు వినిపించారు.
సీఎం జగన్, కొలిజయంపై కఠిన పదజాలం వ్యాఖ్యలు కొట్టివేత
న్యూఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కఠిన పదజాలంతో వ్యాఖ్యలు చేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ రాకేశ్ కుమార్ 2020 డిసెంబర్ 31 ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బేలా ఎం త్రివేది, పంకజ్ మిథాల్లతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల్లోని అన్ని వివాదాస్పద పరిశీలనలను పక్కనబెట్టింది.
ప్రభుత్వ భూములను వేలం వేయడాన్ని సవాలు చేసే కేసు నుండి న్యాయమూర్తిని తప్పుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన తిరస్కరణ దరఖాస్తుకు ప్రతిస్పందనగా జస్టిస్ రాకేశ్ కుమార్ తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలో, జస్టిస్ కుమార్ ఇద్దరు ప్రధాన న్యాయమూర్తుల బదిలీకి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని విమర్శించారు. తన తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేశారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని పరిపాలన వ్యవస్థ హైకోర్టును అణగదొక్కే ప్రయత్నాలకు కారణమైందని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థల పనితీరులో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. ముఖ్యమంత్రిపై క్రిమినల్ కేసుల పరిష్కారంలో జాప్యంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. న్యాయమూర్తి నిజాయితీ, చిత్తశుద్ధి, నిష్పాక్షికతపై ఎలాంటి సహేతుకమైన ఆధారం లేకుండా ప్రశ్నలు తలెత్తినప్పుడు, న్యాయమూర్తి తన రక్షణలో వివాదాస్పద వాస్తవాలను ప్రస్తావించే హక్కును కలిగి ఉంటాడని తీర్పులో నొక్కి చెప్పారు. ఎవరైనా న్యాయమూర్తిపై ఫిర్యాదు చేసినట్లయితే, పరిష్కారం పెద్ద బెంచ్ లేదా పైకోర్టు ముందు ఉంటుందని పేర్కొన్నారు. సరైన ప్రాతిపదిక లేకుండా న్యాయమూర్తిని కించపరిచే ఏదైనా ఫిరాయింపులు లేదా సాహసం ధిక్కారమేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ ”చాలా కష్టంగా” మారిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం మరింత పారదర్శకంగా ఉండాలని, హైకోర్టు న్యాయమూర్తులు కూడా రాజ్యాంగబద్ధమైన పదవులను కలిగి ఉన్నారనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఈ వ్యాఖ్యలను ఇప్పుడు సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, నిరంజన్ రెడ్డి, న్యాయవాది మహఫూజ్ అహ్సన్ నజ్కీ వాదనలు వినిపించారు.
Related posts: