మెస్మరైజ్‌ చేసే ఫాంటసీ థ్రిల్లర్‌

మెస్మరైజ్‌ చేసే ఫాంటసీ థ్రిల్లర్‌సందీప్‌ కిషన్‌ నటించిన ఫాంటసీ అడ్వెంచర్‌ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్‌ దర్శకుడు. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్‌ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఈ చిత్రం ఈనెల16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాత రాజేష్‌ దండా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
విఐ ఆనంద్‌ చెప్పిన కథ చాలా డిఫరెంట్‌గా అనిపించింది. కొత్త కంటెంట్‌తో కొత్త జోనర్‌లో సినిమా చేస్తే ఆ సినిమా సక్సెస్‌ అవుతుంది, క్రేజ్‌ వస్తుందని నమ్మి చేశాం. ఈ రోజు మా నమ్మకం నిజమైంది. సందీప్‌ కిషన్‌ కెరీర్‌లో హయ్యస్ట్‌ బడ్జెట్‌ సినిమా ఇది. అలాగే హయ్యస్ట్‌ బిజినెస్‌ సినిమా కూడా ఇదే. విడుదలకు ముందు చాలా హ్యాపీగా ఉన్నాం. ఆనంద్‌ చెప్పిన దానికి రెండింతలు అద్భుతంగా తీశారు.
ఈ సినిమాతో సక్సెస్‌ ట్రాక్‌ని కొనసాగించి హ్యాట్రిక్‌ కొడతామనే నమ్మకం ఉంది ప్రీమియర్‌ షోలు అన్నీ ఫుల్‌ అయ్యాయి. హైదరాబాద్‌లో ప్రముఖ సింగిల్‌ స్క్రీన్స్‌లో ప్రీమియర్స్‌ అన్నీ ఫుల్‌ కావడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కి అద్దం పడుతున్నాయి.
ఇదొక ఫాంటసీ థ్రిల్లర్‌. మన ఊర్లో ఏం జరుగుతుందో మనికి తెలుసు. కానీ ‘భైరవకోన’ అనే ఊరులో కొత్తగా వెరైటీగా ఎవరూ ఊహించని
సంఘటనలు జరుగుతుంటాయి. అది నాకు చాలా ఆసక్తిని కలిగించింది. అలాగే గరుడపురాణంలో మిస్‌ అయిన పేజీలకి ఈ కథకి ఉన్న లింక్‌ ఏమిటనేది కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. సినిమాలో47 నిమిషాలు పాటు అద్భుతమైన సిజీ వర్క్‌ ఉంది. విజువల్స్‌ చాలా గ్రాండ్‌గా ఉంటాయి. ప్రేక్షకులకు చాలా గొప్ప థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే చిత్రమిది.
నేను, అనిల్‌ కలసి చేసిన సినిమాల కథలు ముందు నేను విని నచ్చితే అనిల్‌ వింటారు. విని ఆయన సలహాలు, సూచనలు చేస్తారు. ఇందులో కూడా ఆయన ఓ విలువైన సూచన చేశారు. అది చాలా హెల్ప్‌ అయ్యింది. కథాపరంగా ఈ కథకు సీక్వెల్‌, ప్రీక్వెల్‌ చేయొచ్చు. రెండు ఆలోచనలు ఉన్నాయి. శేఖర్‌ చంద్ర తన ప్రతి సినిమాలో చాలా మంచి పాటలు ఇస్తారు. ఇందులో ‘నిజమేనా చెబుతున్న..’ పాట చాలా వైరల్‌ అయ్యింది. ఇందులో నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది.
ఇందులో ప్రీ ఇంటర్వెల్‌, ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ అద్భుతంగా ఉంటాయి. ‘భైరవకోన’లోకి ఎంటరైన తర్వాత జర్నీ అంతా థ్రిల్లింగ్‌గా ఫీల్‌ అవుతారు. ఈ సినిమా కోసం సందీప్‌ కిషన్‌ చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. తన కెరీర్‌కి, మా బ్యానర్‌కి ఇది నెంబర్‌ 1 సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అల్లరి నరేష్‌తో ‘బచ్చల మల్లి’ సినిమా చేస్తున్నాం. కిరణ్‌ అబ్బవరంతో ఓ సినిమా చేయబోతున్నాం. త్వరలోనే వాటి వివరాలను తెలియజేస్తాం.