ఏడబ్ల్యుయు సొసైటీ మండల మహిళ అధ్యక్షురాలుగా ఏనుగు నాగరాణి

నవతెలంగాణ – మల్హర్ రావు
అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 కాళేశ్వరం జోనల్  ఐదు జిల్లాల యువశక్తి అధ్యక్షుడు  చింతల కుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడుగా బండి సుధాకర్ సూచన మేరకు  ఏడబ్ల్యుయు మండల అధ్యక్షురాలుగా మండలంలోని కొండంపేట గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు ఏనుగు నాగరాని ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు. తమపై నమ్మకంతో ఈ పదవిని అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్,కుమార్ యాదవ్,బండి సుధాకర్ లకు నాగరాని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ బాధ్యతపై అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీకి మంచి పేరు తీసుకవస్తామని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో కాళేశ్వరం జోనల్ నాయకుడు గంట రాజబాబు,జిల్లా అధ్యక్షు రాలు కొండ రాజమ్మ,కాటారం సబ్ డివిజన్ అధ్యక్షురాలు కొండూరి మమత, ఎస్.యు కాటారం సబ్ డివిజన్ అధ్యక్షుడు వేల్పుల మహేందర్ పాల్గొన్నారు.