– సమాచార హక్కుచట్టం రక్షణ వేదిక కార్యకర్తలు
నవ తెలంగాణ మల్హర్ రావు.
హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సం స్థ లో రెండు రోజుల పాటు నిర్వహించే సమాచార హక్కు చట్టం రాష్ట్ర స్థాయి సెమినార్ వర్క్ షాపుకు ఆర్టీఐ కార్యకర్తలు చింతల కుమార్ యాదవ్,చొప్పరి రాజయ్య,ముత్తోజు వేనాచారి మంగళవారం హైదరాబాద్ కు బయలుదేరారు..ఈ మేరకు బుధ,గురు వారాల్లో నిర్వహించే “PROACTIVE DISCLOUSER OF INFORMATION UNDER RTI ACT” అనే వర్క్స్ షాపు లో రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖల అధికారులతో పాటు ఆర్టిఐ,ఆక్ట్వీస్ట్ లకు నిర్వహించే సెమినార్ లో పాల్గొన,వలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డైరెక్టర్ జనరల్ పంపిన లేఖలో పేర్కొన్నారు.కాగా రాష్ట్ర స్థాయి వర్క్స్ షాపు సెమినార్ కు ఆహ్వానం అందడం పట్ల పలువురు సమాచార హక్కు చట్టం కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు