నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో ఢకొీట్టి చంపిన అమెరికన్ పోలీస్పైన సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అక్కడి ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ వెంటనే జోక్యం చేసుకొని, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి పక్షపాతం లేకుండా స్వతంత్రంగా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అనేక ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి ఈ ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరమనీ, ఆమెకి జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధాకరమని పేర్కొన్నారు. గతేడాది జనవరిలో సియాటెల్ నగరంలో కెవిన్ డేవ్ అనే పోలీసు అధికారి తన కారులో115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో కారు ఢకొీనడంతో జాహ్నవి మరణించింది. అయితే ఆ సంఘటన జరిగిన వెంటనే పోలీస్ అధికారి జరిగిన ప్రమాదం గురించి బాధపడకుండా, వర్ణ వివక్షతో మాట్లాడుతున్న వీడియో బయటకి వచ్చింది. దీంతో ఆ పోలీస్ అధికారి కావాలనే ఢకొీట్టి చంపారని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.