సీఎం సంతాపం

– రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జన్నత్‌ హుస్సేన్‌ మృతి పట్ల…
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జన్నత్‌ హుస్సేన్‌ మృతి పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీగా పని చేసిన జన్నత్‌ హుస్సేన్‌ తెలుగు రాష్ట్రానికి సుధీర్ఘ సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారనీ, వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా పని చేసి స్పెషల్‌ సీఎస్‌ హౌదాలో రిటైరయ్యారని తెలిపారు. అనంతరం సమాచార హక్కు చట్టం చీఫ్‌ కమిషనర్‌గా పని చేశారనీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం 2004లో అమల్లోకి తెచ్చిన ఉచిత విద్యుత్‌ పథకం విధివిధానాలను రూపొందించి రైతులకు మేలు చేయటంలో ఆయన విశేషంగా కృషి చేశారని సేవల్ని గుర్తుచేసుకున్నారు. జన్నత్‌ హుస్సేన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.